గిరిజనుల సేవే తన జీవిత లక్ష్యంగా భావించిన Alok Sagar ప్రతిష్టాత్మక పద్మ అవార్డును తిరస్కరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
“ఈ అవార్డు నన్ను నేను సేవ చేస్తున్న గిరిజన సమాజం నుంచి వేరు చేస్తుంది” అంటూ ఆయన స్పష్టంగా వ్యాఖ్యానించారు.
అలోక్ సాగర్ ఢిల్లీ ఐఐటీలో మాజీ ప్రొఫెసర్గా, ప్రముఖ ఆర్థికవేత్త మరియు మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్కు గురువుగా పనిచేశారు. అమెరికాలోని హ్యూస్టన్ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేసిన ఆయన, విద్యా-వృత్తి జీవితాన్ని వదిలి క్షేత్రస్థాయిలో పని చేయాలనే లక్ష్యంతో మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లా కోచాము గ్రామానికి చేరుకున్నారు.
గత మూడు దశాబ్దాలుగా బేతుల్, హోషంగాబాద్ జిల్లాల్లోని మారుమూల ఆదివాసీ గ్రామాల్లో నివసిస్తూ, గిరిజనుల విద్య, ఆరోగ్యం, జీవనోపాధి కోసం అలుపెరగని సేవ చేస్తున్నారు. నిరాడంబర జీవితం, సాధారణ వస్త్రధారణ, సైకిల్పైనే ప్రయాణం—ఇవన్నీ ఆయన జీవనశైలికి అద్దం పడుతున్నాయి.
“పద్మ అవార్డు ఒక అలంకారం మాత్రమే, అది ఒక స్టాంప్ లాంటిది” అంటూ ఆయన వ్యాఖ్యానించడం విశేషం. అవార్డులు, సన్మానాల కోసం పోటీపడే నేటి సమాజంలో అలోక్ సాగర్ తీసుకున్న ఈ నిర్ణయం నిజమైన సేవ అంటే ఏమిటో మరోసారి గుర్తు చేస్తోంది.
ఆధునిక గాంధీగా పిలువబడే అలోక్ సాగర్ జీవితం—నేటి తరానికి ఆదర్శం, సమాజానికి గుణపాఠం.





