మధిర:
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మధిర పట్టణంలోని గంగా పార్వతీ సమేత మృత్యుంజయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు గర్భాలయంలో స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక ఆరాధనలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆధ్యాత్మిక వాతావరణంతో ఆలయ ప్రాంగణం శోభిల్లింది. వేదమంత్రాల నడుమ జరిగిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భట్టి విక్రమార్క దంపతులు రాష్ట్ర ప్రజల సంక్షేమం, శాంతి, సమృద్ధి కోసం స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఉప ముఖ్యమంత్రిని ఘనంగా సత్కరించారు. భద్రతా ఏర్పాట్లతో పాటు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.




