మహబూబాబాద్ జిల్లాలోని కంబాలపల్లి గ్రామంలో అకస్మాత్తుగా వీచిన ఈదురుగాలి ప్రజలను భయాందోళనకు గురి చేసింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా బలమైన గాలులు వీచడంతో పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు నేలకొరిగి విద్యుత్ స్తంభాలు కూడా దెబ్బతిన్నాయి.
ఈదురుగాలితో గ్రామంలో పంటలకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని కోరుతున్నారు. విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడడంతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.




